Banner
Watermark
కల్యాణ్ సింగ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు
📅 05 January 2026, 11:19 PM ✍️ Editor
News Image
పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి యోగి ఆడిత్యనాధ్

లక్నో: రాజస్థాన్ మాజీ గవర్నర్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పరమ రామభక్తుడు, ‘పద్మ విభూషణ్’ అవార్డు గ్రహీత శ్రద్ధేయ కల్యాణ్ సింగ్ ‘బాబూజీ’ జయంతిని గురువారం లక్నోలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి యోగి ఆడిత్యనాద్ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కల్యాణ్ సింగ్ సేవలు సుశాసనం, అభివృద్ధి మరియు జాతీయవాద దృక్పథాన్ని కొత్త శిఖరాలకు చేర్చినవిగా స్మరించుకుంటున్నామని నేతలు తెలిపారు. ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత, ధైర్యం, నిర్ణయాత్మక నాయకత్వం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని అన్నారు.

‘కల్యాణ్’ అనే పదానికి తన జీవితం, పరిపాలన ద్వారా సార్థకత చేకూర్చిన నాయకుడిగా కల్యాణ్ సింగ్ గుర్తుండిపోతారని పేర్కొన్నారు. ఆయన పావన స్మృతులకు ఈ సందర్భంగా పలువురు ఘన నివాళులు అర్పించారు.
🏠 Home