Banner
Watermark
జాయింట్ కలెక్టర్ ను కలిసిన సొసైటీ చైర్మన్ రాజశేఖర్
📅 29 January 2026, 12:10 PM ✍️ admin
News Image
మండల ప్రధాన కార్యదర్శి ముత్తూరు సుమన్ బాబు.

సీతారామపురం జనవరి 28(వార్త పత్రిక ప్రతినిధి)


సీతారామపురం తాసిల్దార్ కార్యాలయంలో మారంరెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ సోమనబోయిన రాజశేఖర్ మరియు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ముత్తూరు సుమన్ బాబు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు .ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ రాజశేఖర్ యూరియా పంపిణీ మరియు పలు రకాల రైతు సమస్యలపై ఆయనతో చర్చించారు. రైతులకు అవసరమైన అంత యూరియా ప్రభుత్వ అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.అనంతరం జాయింట్ కలెక్టర్ ని శాలువాతో సత్కరించారు.
🏠 Home