యుద్ధం ముగింపునకు 3 షరతులు విధించిన ఇరాన్
📅 12 March 2026, 12:26 PM
✍️ M.Chinna
అమెరికా, ఇజ్రాయెల్లతో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మూడు షరతులు విధించారు. ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను గుర్తించడం, యుద్ధ నష్టపరిహారం చెల్లించడం, భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణలు జరగవని అంతర్జాతీయ హామీలు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు.ప్రాంతీయ శాంతి పట్ల ఇరాన్ తన నిబద్ధతను చాటుకుందని పెజెష్కియాన్ పేర్కొన్నారు. పొరుగు దేశాలతో ఘర్షణ కోరుకోవడం లేదని, తమ భూభాగంపై దాడులు చేయడానికి ఉపయోగించే స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇరాన్పై జరుగుతున్న బలవంతపు యుద్ధం, సైనిక దురాక్రమణ సమస్యలను అంతర్జాతీయ సమాజం పరిష్కరించకపోతే ప్రపంచ భద్రత అస్థిరంగా మారుతుందని పెజెష్కియాన్ హెచ్చరించారు.