Banner
Watermark
అటల్‌ గౌరవార్థం పలు కార్యక్రమాలు
📅 13 March 2026, 11:39 AM ✍️ M.Chinna
News Image
న్యూఢిల్లీ, మార్చి 12 : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి గౌరవార్థం దేశ వ్యాప్తంగా స్మారకోపన్యాసాలతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు మాజీ ఉపరాష్ట్రపతి, అటల్‌ స్మృతి న్యాస్‌ సొసైటీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు తెలిపారు. గురువారం ఢిల్లీలో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌, కేంద్రమంత్రులు ప్రహ్లాద్‌ జోషి, కిషన్‌రెడ్డి, నేతలతో చర్చలు జరిపారు. ఏయే కార్యక్రమాలు నిర్వహించాలో చర్చించినట్లు వెంకయ్య తెలిపారు.
🏠 Home