Banner
Watermark
శబరిమల అయ్యప్ప దర్శనం ప్రారంభం-
📅 15 March 2026, 12:07 PM ✍️ M.Chinna
News Image
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు మీన మాస పూజల కోసం తెరుచుకున్నాయి. మార్చి 14(శనివారం) సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రధాన అర్చకుడు ఈడీ ప్రసాద్ గర్భగుడిని తెరిచి దీపాన్ని వెలిగించారు. అనంతరం పవిత్రమైన 18 మెట్ల దిగువనున్న ఆజి వద్ద అగ్నిని వెలిగించారు. ఇక మొదటి రోజు అనగా ఆదివారం ఉదయం 5 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. కలభాభిషేకం, పడి పూజలు ప్రారంభమయ్యాయి.మార్చి 15 నుంచి భక్తులకు దర్శనంమార్చి 15 (ఆదివారం) ఉదయం 5 గంటల నుంచి భక్తులకు దర్శనం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా కలభాషికేకం, పడిపూజ వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మీనం నెల పూజలు పూర్తయ్యాక మార్చి 19 రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.
🏠 Home