నిరుపేద వితంతువుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి గ్రామ సర్పంచ్ కాకి శ్రీలత సుందర్ కి వినతి పత్రం అందజేత
చౌటుప్పల్, ఏప్రిల్ 24,(వార్త పత్రిక);చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో గ్రామంలోనే అత్యంత నిరుపేద మహిళ అయిన కత్తుల లక్ష్మమ్మ కి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు కత్తుల లక్ష్మమ్మ పక్షానగ్రామస్తులువినతిపత్రాన్నిసమర్పించారు.భర్తను కోల్పోయి నిరాశ్రయురాలిగా మారిన లక్ష్మమ్మకు నివాసం లేక తీవ్ర ఇబ్బందులు పడుతోందని, రేకులషెడ్డులోకాలంవెళ్లదీస్తోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆమెకు ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరారు.వినతిపత్రాన్ని స్వీకరించిన సర్పంచ్ కాకి శ్రీలత సుందర్ సానుకూలంగా స్పందిస్తూ, అర్హులైన లక్ష్మమ్మకు ఇందిరమ్మ ఇల్లుమంజూరుఅయ్యేలాచర్యలుతీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాకి శ్రీలత సుందర్,ఉప సర్పంచ్ బోయ సదానందం,గ్రామ కార్యదర్శి శ్రీకాంత్,బోయ రాములు,లింగస్వామి,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు