ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి ఆర్డిఓ శేఖర్ రెడ్డి
చౌటుప్పల్, మే 02,(వార్త పత్రిక);రెవెన్యూ డివిజనల్ కార్యాలయములు నందు ప్రజావాణి పిర్యాదులు స్వీకరించుటకు గాను తెలంగాణ ప్రభుత్వము నిర్ణయించినందున ఇక నుండి ప్రతి సోమవారము ఈ డివిజన్ పరిధిలోని మండలాలు అనగా చౌటుప్పల్,నారాయణపురం, బి.పోచంపల్లి, వలిగొండ మరియు రామన్నపేట మండలాల ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి ప్రజావాణి నందు దరఖాస్తులు సమర్పించుటకు రెవెన్యూ డివిజనల్ కార్యాలయము, చౌటుప్పల్ కు సంబంధించి, ఎంపిడిఓ కార్యాలయము మీటింగ్ హాలు నందు నిర్వహించనైనది. కావున ఈ ఐదు మండలాల
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని రెవెన్యూ డివిజన్ అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు