వార్త ప్రతిక:-మరిపెడ
సిపిఎం(మం ) రైతు సంఘం బృందం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని గుండెపుడి,తానంచర్ల, బునాహంపురం ఎల్లంపేట, మరిపెడ, ఐకెపి కేంద్రాలాను సందర్శించడం జరిగిందని సిపిఐ(ఎం) మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ మరియు తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి (AIKS) కందల రమేష్ లూ అన్నారు ఈ ఐకెపి కేంద్రాలలో కనీసం రైతులకు ఏర్పాటు చేయవలసిన కనీస సౌకర్యాలు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం కల్పించలేదన్నారు రైతులకు పట్టాలు సరిపడ అందించలేదన్నారు, ఐకెపి కేంద్రాల్లో మ్యాచర్ వచ్చిన వడ్లను కాంట వెయ్యడానికి సరిపడా బస్తాలు లేవన్నారు, కాంటా చేసిన వడ్లకు లారీలు అందుబాటులో రావడం లేదని చెప్పారు, తక్షణమే లారీలు సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, తనంచర్ల ఐకెపి కేంద్రంలో అయితే రైతులకు తాగడానికి మంచినీరు, కూర్చోవడానికి టెంటూ కూడా లేవని వివరించారు, కాంటాలు పూర్తినా లారీలకి రైతులకు ఇంతవరకు అకౌంట్లో డబ్బులు జమ కాలేదన్నారు, అదేవిధంగా ప్రతి ఐకెపి కేంద్రంలో తడిసిన వడ్లను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి రైతులకు ఏర్పాటు చేయవలసిన సౌకర్యాలు అందించకపోతే, రైతులందరిని కూడగట్టి సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడుతామని హెచ్చరించార.ఈ కార్యక్రమంలో రైతు సంగం మండల నాయకులు నలబూరు లక్ష్మారెడ్డి, అల్లి శ్రీనివాస్ రెడ్డి, బయ్య సురేష్, వడ్లకొండ ఉప్పలయ్య, Sk ఇమామ్ సాబ్, రైతులు గుండ గాని గణేష్, లింగాల వెంకన్న, రేఖ ఉపేంద్ర, బింగి ఉమా, అజ్మీర నరేష్ తదితరులు పాల్గొన్నారు