వార్త పత్రిక గండిపేట్:123 డివిజన్ హైదర్షాకోట్ పరిధిలో కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ కు శ్రీమతి లక్ష్మి బాయి 4,00,000/- రూపాయలు ఇవ్వడం జరిగింది. గతంలో లక్ష్మీ బాయి గారి అక్క కూతురు శ్రీమతి పి. లావణ్య బాయి అమెరికా నుండి వచ్చినప్పుడు కస్తూర్బా ట్రస్ట్ ను సందర్శించారు. ట్రస్ట్ లో జరుగుతున్న కార్యక్రమాలకు తమ వంతు సహాయంగా ఈరోజు 4,00,000/- రూపాయలు చెక్కును మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ పూలపల్లి రాజేందర్ రెడ్డితో కలసి ట్రస్ట్ వారికి అందజేయడం జరిగింది. ఇ కార్యక్రమం లో మాజీ వార్డు సభ్యుడు రవికాంత్ రెడ్డి తధితరులు పాల్గొన్నారు. ఇందుకు గాను ట్రస్ట్ తరపున మేనేజర్ మూర్తి మరియు శ్రీనివాస్ దన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
Trending Now:
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్