న్యూఢిల్లీ: ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్ల కోసం ఇవాళ ఎన్నికలు(Rajya Sabha elections) జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరగనున్నది. అయితే 10 రాష్ట్రాల్లో మొత్తం 37 సీట్లకు రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఇప్పటికే 26 అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే కొత్త సభ్యుల కోసం కేవలం 11 సీట్లకు మాత్రమే ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. బీహార్, హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో ప్రస్తుతం ఓటింగ్ కొనసాగుతోంది. బీహార్లో అయిదుగురు, ఒడిశాలో నలుగురు, హర్యానాలో రెండు సీట్ల కోసం ఎన్నిక జరుగుతోంది. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల్లో ఏడుగురు బీజేపీ, అయిదుగురు కాంగ్రెస్, టీఎంసీ నలుగురు, డీఎంకే నుంచి ముగ్గురు ఉన్నారు. శివసే, ఆర్పీఐ, ఎన్సీ, ఎన్సీపీ ఎస్పీ, అన్నాడీఎంకే, యూపీపీఎల్ పార్టీల నుంచి ఒక్కొక్కరు నెగ్గారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రముఖుల్లో శరద్ పవార్, అభిషేక్ సింఘ్వీ, తిరుచ్చి శివ, వినోద్ తవడే ఉన్నారు. అయితే బీహార్ నుంచి ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ కూడా రాజ్యసభ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. తమిళనాడు నుంచి ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరుచ్చి శివ, తందిదురై ఆ జాబితాలో ఉన్నారు.
NATIONAL
11 సీట్లకు రాజ్యసభ ఓటింగ్.. ఏకగ్రీవంగా 26 మంది అభ్యర్థుల గెలుపు
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ