ములుగు జిల్లా (ప్రతినిధి)వార్త పత్రిక
గోవిందరావుపేట మండలంలోని కర్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లేగ దూడ బావిలో పడిపోవడంతో దానిని కాపాడేందుకు బావిలోకి దిగిన తండ్రి రసపుత్రు రాజు, కుమారుడు పవన్ఇద్దరూప్రాణాలుకోల్పోయారు.వివరాల్లోకి వెళ్తే, గ్రామ శివారులోని 35 అడుగుల లోతైన బావిలో లేగ దూడ ప్రమాదవశాత్తు పడిపోయింది. దానిని గమనించిన కుమారుడు పవన్ దూడను కాపాడేందుకు బావిలోకి దిగాడు కొడుకుకి ఏమైనా అవుతుందోనని ఆందోళన చెందిన తండ్రి రసపుత్రు రాజు కూడా వెంటనే బావిలోకి దిగాడు. అయితే వారు పైకి వస్తుండగా తాడు తెగిపోవడంతో ఇద్దరూ బావిలో పడి మునిగిపోయారు.సమాచారం అందుకున్న గ్రామస్తులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తండ్రి రసపుత్రు రాజు మృతదేహాన్ని వెలికితీశారు. కుమారుడు పవన్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో కర్లపల్లి గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక్కసారిగా ఇద్దరిని కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
TELANGANA
కర్లపల్లిలో విషాదం లేగ దూడను కాపాడబోయి బావిలో పడి తండ్రీ కొడుకులు మృతి
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది