వార్త పత్రిక, మిడ్జిల్, ఏప్రిల్ 18
మిడ్జిల్ మండలం, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ రసాయన
శాస్త్రంలో పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా సాధించారు.రసాయన శాస్త్రంలో పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పి.హెచ్.డి. పట్టా నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ నుండి రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టాపొందారు.వారు “క్రోమెనో/పైరానో-క్వినోలిన్స్, ట్రయాజోల్-ఇమిడాజోల్ మరియు క్వినోలిన్-బెంజిమిడాజోల్ సంయుక్తాల సంశ్లేషణ, జీవశాస్త్ర మూల్యాంకనం” అనే అంశంపై పరిశోధన చేసి ఈ డాక్టరేట్ పట్టాను పొందారు. ఈ కీలక పరిశోధనను విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్ (రిటైర్డ్) పి. లీలావతి మార్గదర్శకత్వంలో విజయవంతంగా పూర్తి చేశారు.ఈ అధ్యయనంలో డా. ఖాజా ఆరిఫ్ గ్రీన్ కెమిస్ట్రీ సూత్రాలను అనుసరించి, పర్యావరణానికి అనుకూలమైన, అత్యంత సమర్థవంతమైన మరియు క్రోమాటోగ్రఫీ-రహిత శుద్ధీకరణతో కూడిన సంశ్లేషణ పద్ధతులను అభివృద్ధి చేశారు. వారు సంశ్లేషించిన కొత్త హెటెరోసైక్లిక్ సమ్మేళనాలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు క్యాన్సర్ వ్యతిరేక కార్యకలాపాలను ప్రదర్శించాయి. ఈ ఫలితాలు భవిష్యత్తులో కొత్త ఔషధాల ఆవిష్కరణకు ముఖ్యమైన దోహదపడతాయని ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా మిడ్జిల్ మండలం గ్రామస్తులు కూడా డా. ఎం.డి. ఖాజాకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
TELANGANA MAHABUBNAGAR
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది
అక్రమంగా మట్టి తరలిస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలి