మణికొండ శ్రీ వెంకటేశ్వర కాలనీలో ప్రజా ఉపయోగ స్థలాలపై జరిగిన ఆక్రమణల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
హైడ్రా పరిశీలనలో కమ్యూనిటీ హాల్ స్థలానికి సంబంధించిన ఎల్ఆర్ఎస్ నకిలీ అని గుర్తించబడింది. 1996 టెంటేటివ్ లేఅవుట్ను ఆమోదించబడిన లేఅవుట్గా చూపిస్తూ, లేఅవుట్లో ఉన్న ప్లాట్ల వివరాలను ఆధారంగా చేసుకుని భూకబ్జాదారులు ఇప్పటికే కమ్యూనిటీ హాల్ మరియు సెప్టిక్ ట్యాంక్ స్థలాలను ఆక్రమించినట్లు హైడ్రా గుర్తించినట్లు సమాచారం.
హైడ్రా పరిశీలనలో సెప్టిక్ ట్యాంక్ స్థలం విషయంలో అక్రమంగా హౌస్ నంబర్ అసెస్మెంట్ ఆధారంగా హెచ్ఎమ్డీఏ అనుమతులు పొందినట్లు గుర్తించబడింది. అనంతరం జరిగిన విచారణలో సంబంధిత ఎల్ఆర్ఎస్ నకిలీ అని హెచ్ఎమ్డీఏ నిర్ధారించినట్లు హైడ్రా తెలిపింది.
ఈ పరిణామాల నేపథ్యంలో హైడ్రా అధికారులు ఇప్పటికే ఆక్రమణకు గురైన స్థలంలో నిర్మించిన ఐదు అంతస్తుల భవనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
కాలనీ అసోసియేషన్ సభ్యులు దాఖలు చేసిన కోర్టు రిట్ పిటిషన్ నేపథ్యంలో, హైడ్రా ద్వారా ఓపెన్ స్పేస్, సెప్టిక్ ట్యాంక్ మరియు కమ్యూనిటీ హాల్ స్థలాల పునరుద్ధరణ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
TELANGANA HYDERABAD
వార్తా పత్రిక గండిపేట నార్సింగ్ సర్కిల్ పరిధిలోని
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ