• Other News
  • Live TV
  • పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల మూడు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి

    Reporter
    Journalist Chinna Telangana  |  May 4, 2026, 4:32 pm
    పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల  మూడు  నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి

    తెలంగాణ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లాఉపాధ్యక్షుడు శ్రీను నాయక్
    వార్త పత్రిక షాద్ నగర్ మే04:షాద్ నగర్ గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ కూలీల వేతనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామంలో ఉపాధి హామీ పనిచేసిన ప్రదేశాన్ని సందర్శించి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటివరకు పనిచేసిన ఉపాధి హామీ కార్మికుల వేతనాలు చెల్లించక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నాయని ఆయన విమర్శించారు ఉపాధి హామీ కార్మికులకు వారం వరం పే స్లిప్పులను ఇవ్వాలని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని కొత్తగా తెచ్చిన వి బ్ జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని రోజువారీ కనీస వేతనం 307 నుంచి 800 రూపాయలు పెంచాలని కనీస పని దినాలు 200 రోజులు పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అయినా ప్రభుత్వని డిమాండ్ చేశారు అదేవిధంగా నూతనంగా రోజువారి రెండు పూటలు రెండు ఫోటోలు తీసే విధానాన్ని రద్దు చేయాలని పైన ప్రభుత్వాన్ని వెంటనే సమస్యలు పరిష్కరించాలని లేనిచో ఎంపీడీవో కార్యాలయాన్ని కార్మికులతో ముట్టడిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీలురవి నర్సింలు సత్తయ్య నరసమ్మ రవి అందాలు అంజమ్మ ఈశ్వరమ్మ నరసమ్మ జయమ్మ బాలయ్య సంతోష పార్వతమ్మ యాదమ్మ జ్యోతి సత్తెమ్మ మౌనిక లింగమయ్య రాములమ్మ అరుణ బాలకిషన్ సత్తెమ్మ లింగమ్మ లక్ష్మమ్మ శాంతమ్మ భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow