• Other News
  • Live TV
  • ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

    Reporter
    Journalist Chinna Telangana  |  May 7, 2026, 2:36 pm
    ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

    చౌటుప్పల్, మే 07,(వార్త పత్రిక);చౌటుప్పల్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హరీశ్ రావు దృష్టికి తీసుకువచ్చారు.గత 30 రోజులుగా ధాన్యం కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నామని, క్వింటాకు 7 కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
    లారీలు అందుబాటులో లేకపోవడం,గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు.అలాగే లంచాలు ఇవ్వనిదే కాంటాలు వేయడం లేదని, అకాల వర్షాలతో ధాన్యం తడిసి రంగు మారిపోతుందని రైతులు తమ గోడును హరీశ్ రావుకు వివరించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు

    📰 e-Paper Clip
    Google News Follow