• Other News
  • Live TV
  • 'ముగ్గురు మహిళలు బాస్​లుగా ఉన్న కుటుంబంలో పెరిగా'- విద్యార్థులతో రాహుల్ గాంధీ

    Reporter
    Journalist Chinna Telangana  |  March 8, 2026, 4:53 pm
    'ముగ్గురు మహిళలు బాస్​లుగా ఉన్న కుటుంబంలో పెరిగా'- విద్యార్థులతో రాహుల్ గాంధీ

    అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళ విద్యార్థులతో ముచ్చటించిన ఓ వీడియోను ఆదివారం తన యూట్యూబ్ ఛానల్​లో పోస్టు చేశారు. అందులో రాహుల్ గాంధీ విద్యార్థులతో మాట్లాడుతూ, 'ముగ్గురు మహిళలు బాస్​లుగా ఉన్న కుటుంబంలో తాను పెరిగానని' అన్నారు. సాధారణంగా పురుషుల కంటే మహిళే తెలివైన వారని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని రోజుల క్రితం కేరళ కేరళలో లంచ్ ఇంటరాక్షన్ సమయంలో కొంత మంది విద్యార్థినులను కలిశానని, వారితో చాలా ఆసక్తికర సంభాషణ జరిగిందని పేర్కొన్నారు.'ప్రతి విద్యార్థిని కలలు, ఉత్సుకత, ఆత్మవిశ్వాసం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహిళలు తమ సామర్థ్యాన్ని గుర్తించి, ఓపెన్ మైండ్​తో ముందుకు సాగినప్పుడు, వారు అసాధారణ మార్పులను తీసుకురాగలరని ఇటువంటి సంభాషణలు మనకు గుర్తు చేస్తాయి' అని రాహుల్ అన్నారు. "ప్రతి మహిళ ఒక విశిష్ఠమైనది. వారికున్న సున్నితత్వం, అవగాహన, మేధస్సు (ఎమోషనల్ ఇంటెలిజెన్స్​) సమాజానికి తగిన సమతుల్యతను, దిశానిర్దేశాన్ని అందిస్తాయి. మహిళలు తమదైన మార్గాల్లో చాలా ఓర్పుతో, దీర్ఘకాలిక దృక్పథంతో అధికారాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వాళ్లు సమాజం విధించే పరిమితులకు లోబడకుండా, తమ గుర్తింపు, వ్యక్తిత్వం, ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగేందుకు అవసరమైన ప్రతి హక్కును కలిగి ఉంటారు" అని ఆయన ఎక్స్​లో మరో పోస్టు పెట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. "మీ బలం, ధైర్యం, కలలు సమాజాన్ని సానుకూల భవిష్యత్తు వైపునకు నడిపించాలి" అని ఆకాంక్షించారు.ఎంతో స్ఫూర్తినిచ్చింది!
    కేరళలోని యువ విద్యార్థులతో ముచ్చటించడం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని రాహుల్ పేర్కొన్నారు. "వారి ఆత్మవిశ్వాసం, తమ కలలపై ఉన్న నమ్మకం, మహిళలే మార్పునకు అంతిమ శక్తి అని నిరూపిస్తున్నాయి" అని అన్నారు. ఆ వీడియోలో రాహుల్ గాంధీ విద్యార్థినులతో సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు.

    📰 e-Paper Clip
    Google News Follow