బిహార్ సీఎం నీతీశ్కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ జేడీయూలో చేరారు. పట్నాలోని జేడీయూ హెడ్క్వార్టర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి రాజీవ్ రంజన్సింగ్, జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా సహా పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిశాంత్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.తన తండ్రి పెద్దల సభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని, అది ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. ఆయన నిర్ణయాన్ని అందరం గౌరవిస్తున్నట్లు చెప్పారు. తనతండ్రి మార్గదర్శకత్వంలో తామంతా పనిచేస్తామని నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. 20ఏళ్లు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తన తండ్రి రాష్ట్రానికి ఎంతో సేవ చేశారని చెప్పారు. బిహార్ ప్రజలు ఆయన చేసిన అభివృద్ధిని ఎప్పటికీ మరిచిపోరని తెలిపారు. పార్టీ కండువా కప్పుకున్న అనంతరం తండ్రి నీతీశ్ను కలిసి మిఠాయి తినిపించారు. ఆయన వెంట సంజయ్ ఝా కూడా ఉన్నారు.
NATIONAL
జేడీయూ పార్టీలో చేరిన నీతీశ్ తనయుడు నిశాంత్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ