వాషింగ్టన్: ఇరాన్ ఆయిల్ నిల్వల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయడంపై అమెరికా మండిపడింది. ఏం చేస్తున్నావంటూ ‘డబ్ల్యూటీఎఫ్’ పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తొలిసారి తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తినట్లు యాక్సియోస్ వార్తా సంస్థ పేర్కొంది. శనివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్, పరిసర ప్రాంతాల్లోని 30 చమురు డిపోలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఇరాన్ రాజధానిలోని పలు ప్రాంతాలను దట్టమైన పొగలు చుట్టుముట్టాయి. యాసిడ్ వర్షం పడే అవకాశం ఉండటంతో ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది.కాగా, ఇరాన్ ఆయిల్ డిపోలపై దాడుల గురించి ఇజ్రాయెల్ ముందుగానే అమెరికాకు తెలియజేసింది. అయితే ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఇరాన్ చమురు నిల్వలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నది. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్పై ఆగ్రహం వ్యక్తం చేశారని అమెరికా సీనియర్ అధికారి ఒకరు ‘యాక్సియోస్’తో అన్నారు. ‘ఇది అమెరికా అధ్యక్షుడికి నచ్చలేదు’ అని ట్రంప్ కార్యాలయం ఇజ్రాయెల్కు స్పష్టం చేసిందన్నారు. ‘వాట్ ద ఫ*’ పదజాలంతో ట్రంప్ ఆగ్రహంతో కూడిన సందేశాన్ని కూడా వైట్హౌస్ పంపినట్లు అమెరికా అధికారి తెలిపారు. ఇజ్రాయెల్ను ఈ మేరకు ట్రంప్ గట్టిగా హెచ్చరించినట్లు పేర్కొన్నారు.
మరోవైపు రోజువారీ పౌర వినియోగానికి సంబంధించిన సౌకర్యాలపై దాడులు ఊహించని పరిణామాలను కలిగిస్తాయని అమెరికా ఆందోళన చెందినట్లు ఆ అధికారి తెలిపారు. అలాగే ఇరాన్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు కూడగట్టే అవకాశంతో పాటు ప్రపంచ చమురు ధరలు పెరిగే పరిణామంపై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పారు. ‘ఈ దాడి అధ్యక్షుడికి ఇష్టం లేదు. ఆయన చమురును ఆదా చేయాలనుకుంటున్నారు. దానిని మండించేందుకు ఇష్టపడరు. ఇది అధిక గ్యాస్ ధరలను ప్రజలకు గుర్తు చేస్తుంది’ అని ట్రంప్ సలహాదారుడు అన్నట్లు ‘యాక్సియోస్’ పేర్కొంది. అయితే ఈ మీడియా కథనంపై వ్యాఖ్యానించేందుకు వైట్ హౌస్, లేదా ఇజ్రాయెల్ సైన్యమైన ఐడీఎఫ్ నిరాకరించాయి.
INTERNATIONAL
| ఇరాన్ ఆయిల్ నిల్వలపై ఇజ్రాయెల్ దాడులు.. ‘డబ్ల్యూటీఎఫ్’ పదజాలంతో అమెరికా ఆగ్రహం
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ