• Other News
  • Live TV
  • అనిల్‌ అంబానీ కుమారుడ్ని విచారించిన సీబీఐ

    Reporter
    Journalist Chinna Telangana  |  March 14, 2026, 4:26 pm
    అనిల్‌ అంబానీ కుమారుడ్ని విచారించిన సీబీఐ

    న్యూఢిల్లీ, మార్చి 13: బ్యాంకును మోసం చేశారన్న కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ కుమారుడు జై అన్మోల్‌ అంబానీని శుక్రవారం సీబీఐ విచారించింది. ఇక్కడి ప్రధాన కార్యాలయంలో సుమారు ఆరున్నర గంటల పాటు పలు ప్రశ్నలు వేసింది. శనివారం కూడా విచారణ కొనసాగనుందని అధికారవర్గాలు తెలిపాయి. రిలయెన్స్‌ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌హెచ్‌ఎ్‌ఫఎల్‌) పేరుతో రుణం తీసుకొని రూ.228 కోట్ల మేర మోసం చేసినట్టు ఆయనపై కేసు నమోదయింది. ఆ సంస్థకు డైరెక్టర్‌గా పనిచేయడంతో అన్మోల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు ఆ సంస్థ మాజీ సీఈఓ, పూర్తికాల డైరెక్టర్‌ రవీంద్ర సుధాకర్‌, మరికొందరిపైనా కేసులు పెట్టింది. తమ నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించలేదంటూ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (పూర్వ ఆంధ్రాబ్యాంకు) చేసిన ఫిర్యాదు మేరకు 2019లో సీబీఐ కేసు నమోదు చేసింది.

    📰 e-Paper Clip
    Google News Follow