• Other News
  • Live TV
  • గల్ఫ్ దేశాలపై ఇరాన్‌ దాడులు తీవ్రతరం..

    Reporter
    Journalist Chinna Telangana  |  March 28, 2026, 1:02 pm
    గల్ఫ్ దేశాలపై ఇరాన్‌ దాడులు తీవ్రతరం..

    క్షిపణి శకలాలు కెజాద్‌లోని రెండు ప్రాంతాల్లో పడటంతో పెద్దఎత్తున మంటలు చెలరేగినట్లు యూఏఈ డిఫెన్స్‌ మినిస్ట్రీ తెలిపింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నది. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఐదుగురు భారతీయులు గాయపడ్డారని, ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది.

    కాగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకి మరింత పెరుగుతున్నాయి. అమెరికా- ఇజ్రాయెల్‌ దేశాలకు, ఇరాన్‌కు మధ్య కొనసాగుతున్న యుద్ధంలోకి తాజాగా హౌతీలు కూడా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. శనివారం యెమెన్‌ నుంచి ఓ క్షిపణి తమదేశం వైపు దూసుకొచ్చిందని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ పేర్కొన్నది. ఇరాన్‌కు మద్దతుగల హౌతీలు దక్షిణ ఇజ్రాయెల్‌ పైకి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించాయని, తమ వైమానిక రక్షణదళాలు వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయని తెలిపింది.

    📰 e-Paper Clip
    Google News Follow