చండీగఢ్: కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణించిన ఎస్యూవీ వాహనం టైర్ రిపేర్ కోసం రోడ్డు పక్కన నిలిచి ఉన్నది. ఒక లారీ వెనుక నుంచి ఆ వాహనాన్ని ఢీకొట్టింది. కాంగ్రెస్ నేతతో పాటు డ్రైవర్ ఈ ప్రమాదంలో మరణించారు. పంజాబ్ కాంగ్రెస్ నేత ఖుష్బాజ్ సింగ్ జట్టానా తన ఎస్యూవీ వాహనంలో ప్రయాణించారు. గురువారం రాత్రి కుండ్లీ-ఘజియాబాద్-పల్వాల్ ఎక్స్ప్రెస్వేపై వెళ్తుండగా ఆ వాహనం టైర్లో గాలిపోయింది. దీంతో రిపేర్ కోసం ఆ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపారు.కాగా, వేగంగా వచ్చిన లారీ ఆగి ఉన్న ఎస్యూవీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖుష్బాజ్ జట్టానాతో పాటు ఆయన డ్రైవర్ పర్మిందర్ సింగ్ మరణించారు. ఆయన గన్మ్యాన్కు గాయాలయ్యాయని పోలీస్ అధికారి తెలిపారు. ఖుష్బాజ్ జట్టానా వాహనాన్ని ఢీకొట్టిన లారీని గుర్తించినట్లు చెప్పారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు.
NATIONAL
ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. కాంగ్రెస్ నేత, ఆయన డ్రైవర్ మృతి
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్స్ వద్ద డంపింగ్ యార్డ్ తొలగించాలి: సీపీఎం డిమాండ్