• Other News
  • Live TV
  • దీదీ చేసేవన్నీ 'విక్టిమ్​ కార్డ్​' రాజకీయాలు- బంగాల్ నుంచి టీఎంసీని తొలగించండి: అమిత్​ షా

    Reporter
    Journalist Chinna Telangana  |  March 28, 2026, 4:36 pm
    దీదీ చేసేవన్నీ 'విక్టిమ్​ కార్డ్​' రాజకీయాలు- బంగాల్ నుంచి టీఎంసీని తొలగించండి: అమిత్​ షా

    బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోం మంత్రి అమిత్​ షా విమర్శలు గుప్పించారు. మమత ఎప్పుడూ బాధితురాలిగా (విక్టిమ్ కార్డు పోలిటిక్స్​) నటిస్తుంటారని ఆరోపించిన ఆయన, దీదీ ఎత్తుగడలను బంగాల్ ప్రజలు ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారని అన్నారు. శనివారం అధికార తృణమూల్ కాంగ్రెస్​ (టీఎంసీ) ప్రభుత్వంపై ఛార్జిషీటు విడుదల చేస్తూ ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
    "మమత బెనర్జీ ఎప్పుడూ బాధితురాలిగా నటిస్తూ రాజకీయాలు చేస్తుంటారు. కొన్ని సార్లు ఆమె కాలు విరగ్గొట్టుకుంటారు. మరికొన్ని సార్లు తలకు కట్టుకుంటారు. కొన్ని సార్లు అనారోగ్యానికి గురవుతారు. ఆపై మళ్లీ ఎన్నికల సంఘం ముందు నిలబడి ఆ సంస్థను దూషిస్తూ నిస్సహాయతను ప్రదర్శిస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ విక్టిమ్ కార్డు రాజకీయాలను బంగాల్​ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. అదే విషయాన్ని ఆమెకు చెప్పడానికి నేను ఇక్కడకు వచ్చాను. "
    - అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి
    ఎస్​ఐఆర్​ విషయంలోనూ!"ఇక ఎస్​ఐఆర్ విషయానికి వస్తే, కేవలం బంగాల్​లోనే న్యాయాధికారులను నియమించారు. దేశంలో మరెక్కడా ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. దీనికి కారణం ఏమిటో బంగాల్ ప్రజలకు మమతా బెనర్జీ సమాధానం చెప్పాలి. ఆమె ఎస్​ఐఆర్​పై ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ రోజు నేను బంగాల్ ప్రజలను అడుగుతున్నాను. దేశంలోకి చొరబడినవారు బంగాల్ భవిష్యత్​ను నిర్ణయించేందుకు మనం అనుమతించాలా? నేను ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నా, ఓటర్ల జాబితా నుంచే కాదు, దేశం నుంచి కూడా చొరబాటుదారులను వెళ్లగొట్టడమే బీజేపీ పార్టీ అజెండా" అని అమిత్​ షా తేల్చిచెప్పారు.

    📰 e-Paper Clip
    Google News Follow